
జైపూర్: రాజస్థాన్కు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి జోధ్పూర్కు వెళ్తున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్కు చెందిన ఎనిమిది క్యారేజీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సూర్యనగరి ఎక్స్ప్రెస్ బాంద్రా ముంబై నుండి జోధ్పూర్ వరకు నడుస్తుంది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3.27 గంటలకు బారీలోని రాజ్కియావాస్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో ఎనిమిది బోగీలు బోల్తా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో 11 ప్యాసింజర్ కార్లు చిక్కుకున్నట్లు నార్త్ వెస్ట్ రైల్ సీపీఆర్వో తెలిపారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక వాహనాల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే రైలు మార్గంలో మరమ్మతులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో 12 రైళ్లను దారి మళ్లించగా, రెండు రైళ్లను రద్దు చేశారు.
ఇంతలో, మార్వార్ జంక్షన్ నుండి బయలుదేరిన ఐదు నిమిషాల తర్వాత రైలు అకస్మాత్తుగా కుదుపుకుందని ఒక ప్రయాణీకుడు చెప్పారు. రెండు మూడు నిమిషాల్లోనే పెద్ద చప్పుడు వినిపించి రైలు ఆగిందని తెలిపారు. ఎనిమిది స్లీపర్ బోగీలు పట్టాలు తప్పి పడిపోయాయని చెప్పారు. 15-20 నిమిషాల్లో ప్రమాద స్థలానికి అంబులెన్స్ చేరుకుంది.
“మార్వార్ జంక్షన్ నుండి బయలుదేరిన 5 నిమిషాల లోపే, రైలు లోపల కంపనాలు వినిపించాయి మరియు 2-3 నిమిషాల తరువాత, రైలు ఆగిపోయింది. మేము దిగినప్పుడు కనీసం 8 స్లీపర్ కార్లు ట్రాక్ల నుండి కనిపించాయి. 15-20 నిమిషాల్లో, అంబులెన్స్ వచ్చింది” అని ఒక ప్రయాణికుడు చెప్పాడు pic.twitter.com/aCDjmZEFyq
— ANI MP/CG/రాజస్థాన్ (@ANI_MP_CG_RJ) జనవరి 2, 2023
