జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సినీఫక్కీలో ఓ ఏటీఎంను దుండగులు చోరీ చేశారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులోని ఏటీఎంలో శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు నగదు అపహరించారు. ATM నుండి డబ్బు డ్రా చేస్తున్నప్పుడు, అలారం మోగుతుంది. సమాచారం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే పెట్రోలింగ్ కారు అక్కడికి వచ్చేసరికి అప్పటికే డబ్బును పెట్టెలో వేసిన దొంగలు కారు ఎక్కుతున్నారు.
దుండగులు గమనించి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తీసుకెళ్తున్న డబ్బుల పెట్టె రోడ్డుపై పడింది. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో లోపల ఉన్న డబ్బు రోడ్డుపై చెల్లాచెదురుగా పడింది. రోడ్డుపై వదిలేసిన సుమారు రూ.1.9 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు పట్టుబడకుండా తప్పించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
The post ఏటీఎం చోరీ.. పోలీసులు రాగానే రోడ్డుపై డబ్బులు వదిలేసి పారిపోతారు appeared first on T News Telugu.
