మీ రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కిడ్నీ వ్యాధికి చెక్ పెట్టేందుకు తాజా చేపలు ఉపయోగపడతాయని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్తో కలిసి జరిపిన సంయుక్త అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. 12 దేశాల్లో 25,000 మంది వాలంటీర్లతో 19 ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఫలితాలను ధృవీకరించినట్లు పరిశోధకులు తెలిపారు.
వారానికి మూడు సార్లు చేపలు తింటే కిడ్నీ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. నివేదికల ప్రకారం, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ మరియు ఇతర పోషకాలతో పాటు, విటమిన్ డి కూడా చేపల ద్వారా శరీరానికి శోషించబడుతుంది. ఈ ప్రయోజనాలను సాల్మన్, ట్రౌట్, ట్యూనా, స్వోర్డ్ ఫిష్, మాకేరెల్, సార్డినెస్ మరియు హెర్రింగ్ వంటి జిడ్డుగల చేపలలో చూడవచ్చు.
చేపలలో లభించే ఒమేగా-3 పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మన గుండెలకు మరియు కిడ్నీలకు మంచివని తాజా పరిశోధనలో తేలింది.
The post వారానికి మూడు సార్లు చేపలు తింటే ఈ వ్యాధికి చెక్ పెట్టవచ్చు appeared first on T News Telugu.
