ఛత్తీస్గఢ్లో బీజేపీ నేతను మావోయిస్టులు ఇంటి నుంచి బయటకు లాగి హత్య చేశారు. బీజాపూర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కళ్ల ముందే బీజేపీ నేత నరికి చంపారు. నీలకంఠం కక్కెం బీజాపూర్ ఉసుర్ బ్లాక్ బీజేపీకి 15 ఏళ్లుగా చైర్మన్గా ఉన్నారు. బైలాన్ గ్రామంలో తన పూర్వీకుల వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్టు)కి చెందిన మావోయిస్టులు అక్కడికి వచ్చి నీలకంఠంపై గొడ్డళ్లు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఏసీపీ చంద్రకాంత్ గోవర్నా తెలిపారు.
ఆవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పైక్రాంలో మావోయిస్టుల చేతిలో ఒకరి హత్యకు గురైనట్లు సమాచారం అందిందని, వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని ఏసీపీ తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాదాపు 150 మంది మావోయిస్టులు దాడికి వచ్చినట్లు తెలుస్తోంది. వారంతా సాధారణ దుస్తులతో వచ్చారని, ముగ్గురు మాత్రమే బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్లి దాడి చేశారని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు.
