
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈరోజు (శనివారం) పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 10 నెలలుగా సిద్ధూ పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 65 ఏళ్ల గుర్నామ్ సింగ్ 1988లో కారు ప్రమాదంలో మరణించారు. ట్రాఫిక్ ప్రమాదంలో సిద్ధూ జైలు పాలయ్యాడు. అయితే తీర్పు ప్రకారం మేలో సిద్ధూ విడుదల కావాల్సి ఉంది. జైలులో సత్ప్రవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారు.
