బీజేపీ విధానాలన్నీ తెలంగాణకు వ్యతిరేకమని, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘బండి సంజయ్ విచిత్రంగా మాట్లాడతాడు. విద్యార్థుల జీవితాలతో సంజయ్ రాజకీయాలు ఆడుతున్నారు. రెండు లీక్లకు మీరే బాధ్యులు. ఎన్నో పాపాలు చేసి.. అధికారంలోకి రావాలన్నది బీజేపీ విధానం. బండి, అసలు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? మీరు ఇప్పటికైనా మీ తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పాలి. మీరు ఏ తప్పూ చేయకపోతే, మీ ఫోన్ను పోలీసులకు ఎందుకు అప్పగించకూడదు? బీ అంటే బ్రోకర్.. జే అంటే జుమ్లా.. పీ అంటే పేపర్ లీకేజీ రాజకీయం అంటూ బీజేపీ చేసింది.. బండి సంజయ్ పై చర్యలు తీసుకోకుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం కూడా వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
The post ఎన్ని నేరాలు చేయాలన్నా.. వేదికపై ఉండాల్సిందే.. ఇదే బీజేపీ విధానం appeared first on T News Telugu.
