
జకార్తా: ఇండోనేషియాలో మరో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్లోని తనింబర్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.9గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. భూమిలోపల 70.2 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు సమాచారం. తనింబర్ దీవులను తైమూర్ లౌట్ అని కూడా అంటారు. ఇక్కడ 65 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇండోనేషియా అనేది భూకంపాలకు గురయ్యే అగ్నిపర్వత ద్వీపాల సమూహం. ఈ సంవత్సరం, భూకంపాల సంఖ్య ప్రతినెలా మారుతుంది.
