మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగిన మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డుల ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గౌరవ అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో విషాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం మండుటెండ సభకు సరైన ఏర్పాట్లు చేయడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు.
సీట్లు వేసినా పైకప్పు వేయడం మరిచిపోయారు. దీంతో పార్టీకి వచ్చిన జనం మండుతున్న ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు వడదెబ్బతో 11 మంది చనిపోయారు. 50 మందికి పైగా వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
