
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువయ్యిందన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా 34లో రూ.2.75 లక్షలతో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖాన, యోగా కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి మించిన వైద్య సేవలు, చికిత్సలు, శస్త్ర చికిత్సలు అందిస్తోందన్నారు. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద, సామాన్య ప్రజల సౌకర్యార్థం అన్ని అధునాతన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న మందులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
