మంత్రి గంగుల |రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ వినోద్ కుమార్ శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ నెల 31వ తేదీ సందర్భంగా
కరీంనగర్ పట్టణంలోని పద్మానగర్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర ఆలయంలో భూమిపూజకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిని ఆహ్వానించారు.
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలోని అంతర్భాగం, గోపురాలు, వెలుపలి ఆలయ నిర్మాణాలు, మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రాలు తదితర నమూనాలను పరిశీలించారు. మంత్రి వెంట తెలంగాణ టీటీడీ బోర్డు అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు, దొంత రమేష్ తదితరులు పాల్గొన్నారు.
