కర్నూలు, ఏపీ: రెప్పపాటు కాలంలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవనకొండ మండలం గూడమిరకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అడ్డాకుల రంగనాయకులు(28). పత్తికొండ మండలం చిన్నహుల్తికి చెందిన లత (25 ఏళ్లు)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు (7 నెలలు) ఉన్నాడు.
కాగా, శనివారం పొలానికి వెళ్లే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో రత పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక మృతి చెందింది. భార్య చనిపోవడంతో మనస్తాపం చెందిన రంగనాయకులు కొట్ర రైల్వేస్టేషన్లో పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విభజన-రెండవ నిర్ణయం రెండు కుటుంబాలను నాశనం చేసింది మరియు ఏడు నెలల చిన్నారిని అనాథగా చేసింది.
