అగ్ని ప్రమాదం పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది.

పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో రమణారెడ్డి (47), సతీష్ (45), మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

