నేడు (సోమవారం) సీఎం కేసీఆర్ జోగులాంబ గద్వార జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గద్వాల సెంటర్లో నూతన ఇంటిగ్రేటెడ్ క్యాషియర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గద్వాల అయిజ రోడ్డులో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో గద్వాల పట్టణం గులాబీమయమైంది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బీఆర్ ఎస్ నాయకుల గుర్తులు, బ్యానర్లతో నిండిపోయాయి. కంబైన్డ్ కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
