హైదరాబాద్: జూన్ 23 నాటికి రూ.2000 నోట్లలో మూడింట రెండు వంతులు (66.66%) బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ ఏడాది మే 19న 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
రూ.3.62 బిలియన్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయని, అందులో రూ.2.41 బిలియన్ల విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిపాజిటరీ నోట్ల గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న సంగతి తెలిసిందే.
2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోటును చలామణిలోకి తెచ్చింది. అప్పటి నుండి, 2018-19లో, కొత్త రూ. 2,000 నోట్ల ముద్రణ నిలిపివేయబడింది మరియు ఈ సంవత్సరం మేలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొత్తం రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించింది.
