హైదరాబాద్: శాంతిభద్రతల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా TENAB ఆధ్వర్యంలో శౌర్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, డ్రగ్స్ వినియోగంతో కుటుంబాలు, సమాజాన్ని నాశనం చేయవద్దని కోరారు. యువత డ్రగ్స్ బారిన పడకూడదని, ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నటి కృతిశెట్టి, డిజిపి అంజనీకుమార్, టి నాబ్ డైరెక్టర్ సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
The post “డ్రగ్స్ తో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి…” appeared first on Telugu News.
