న్యూయార్క్లోని భారతీయులకు శుభవార్త. హిందువులు జరుపుకునే దీపావళిని న్యూయార్క్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు.
దీపావళికి పాఠశాలను మూసివేయడానికి కౌన్సిలర్ జెన్నిఫర్ రాజ్కుమార్ మరియు భారతీయ సమాజం కృషి చేశారని మేయర్ చెప్పారు. దీపావళికి నగరంలోని పాఠశాలలను మూసివేయాలని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్ రాజ్కుమార్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
