‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాల ద్వారా జాతీయ ప్రేక్షకులను కట్టిపడేసిన కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఈ సిరీస్ జపాన్లో విడుదల కానుంది.

‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాల ద్వారా జాతీయ ప్రేక్షకులను కట్టిపడేసిన కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఈ సిరీస్ జపాన్లో విడుదల కానుంది. ఈ సారి మీకు కూడా ఈ అద్భుతమైన యాక్షన్ సినిమాలు నచ్చుతాయని భావిస్తున్నాను అని యష్ అన్నారు.ఈ నెల 14న జపాన్ ప్రేక్షకులు సిద్ధం కావాలి. ’ అని వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఇటీవల ఇండియన్ సినిమాలకు జపాన్లో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. “త్రీ ఇడియట్స్”, “ఏక్తా టైగర్”, “బాహుబలి” సిరీస్, “ధూమ్-3”, “కబాలి” మరియు “రేస్-3” వంటి చిత్రాలు జపాన్లో మంచి బాక్సాఫీస్ ఫలితాలను సాధించాయి. ఈ నేపథ్యంలో “కేజీఎఫ్” సినిమా జపాన్లో విడుదలవుతోంది. ఇదిలా ఉంటే హీరో యాష్ తన తదుపరి సినిమాని ఇంకా ప్రకటించలేదు. “కేజీఎఫ్-3”కి సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

