
కేంద్రంలోని బీజేపీకి వ్యాపారాలు, వ్యక్తుల నుంచి రూ.10,122 కోట్ల విరాళాలు అందాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ తాజా సంయుక్త నివేదిక ప్రకారం, 2016-17 మరియు 2021-22 మధ్య, BJPకి అందిన మొత్తం విరాళాలు అన్ని ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. కాంగ్రెస్కు రూ.1,547.43 కోట్లు, టీఎంసీకి రూ.823.3 కోట్లు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. కమలం పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.5,271.97 కోట్లు (52 శాతం) అందాయని, ఇతర జాతీయ పార్టీలు రూ.1,783.93 కోట్లు పొందాయని చెప్పారు. అయితే ఆ పార్టీ నేతల బెదిరింపు రాజకీయాల వల్లే బీజేపీకి ఇంత పెద్దమొత్తంలో విరాళాలు అందాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
