హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో భారీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని పేస్ట్గా మార్చేందుకు ప్రయత్నించారు. అయితే కస్టమ్స్ అధికారులు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. ఆ క్రమంలో వారి పర్సులో మెత్తని బంగారం ఉంది. దీంతో అక్రమంగా తరలిస్తున్న పసిడిలను అధికారులు జప్తు చేశారు. దీని విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని సమాచారం. ఇద్దరు దుబాయ్ ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారించారు.
836077