ప్రపంచ దేశాల ఒత్తిడిని ఉత్తర కొరియా పట్టించుకోలేదు. ఉత్తర కొరియా ఈ నెల 3న ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం)ను పరీక్షించగా, తాజాగా శుక్రవారం మరో ఐసీబీఎంను పరీక్షించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్లు ప్రకటించాయి.
ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు సియోల్ మిలిటరీ తెలిపింది. ఇది సుదూర ఆయుధమని, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదని చెప్పారు. దీంతో ఏ అమెరికా లక్ష్యమైనా ఓడిపోవచ్చు.
మరోవైపు ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడంపై జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. హక్కైడో ప్రాంతంలోని జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్) జలాల్లో ఈ క్షిపణి దిగినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తెలిపారు. ఉత్తర కొరియా చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు.
