తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఈ నెలలో 2,000 విలేజ్ క్లినిక్లను ప్రారంభించనున్నారు. హైదరాబాద్లో బస్తీ దవాఖాన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం.
సద్దితిన్న రేవు తలవాలి. లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు నియ్యత్తోనే ఆశీస్సులు ఉంటాయని ఆయన కోరారు. గత గజ్వేల్ పాలకులు సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి హయాంలో జరగని గజ్వేల్ అభివృద్ధి సీఎం కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మి కార్యక్రమాన్ని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అందించలేదని, మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అందించారన్నారు.