మార్చి 12వ తేదీన టీఎస్ పీజీఈసెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణ కుమారి తెలిపారు. ఇవాళ(మంగళవారం) పీజీఈసెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంలో జరిగింది. మార్చి 16వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 10. జూన్ 6వ తేదీ నుంచి 9 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ పీజీఈసెట్ను జేఎన్టీయూ నిర్వహించనుంది.
ఇది కూడా చదవండి: గ్రూప్-1లో మరో 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
