రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 మరో 60 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్తగా పోస్టులను మంజూరు చేయడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ఆదేశించింది. అయితే ఈ పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా..? లేదా.. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసే దిశలో TSPSC చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గానూ గతేడాది జూన్ 11వ తేదీన TSPSC ప్రిలిమ్స్ నిర్వహించింది. అయితే కోర్టు ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 21న టీఎస్ ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల
