శ్రీరీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఇవాళ(శనివారం) సాయంత్రం జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లింది. తొలి రెండు దశలు విజయవంతం అయ్యాక, క్రయోజనిక్ దశ కూడా సాఫీగా సాగింది. ఈ క్రమంలో పలు విన్యాసాల ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చారు.
ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. వాతావరణ అంచనా, విపత్తులను ముందే హెచ్చరికలు చేస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి పనిచేయనుంది.
ఇది కూడా చదవండి:దేశ వ్యాప్తంగా కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్
