సిద్దిపేట నియోజకవర్గం 10లో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇవాళ(బుధవారం) జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. ఈ పాఠశాల దినదిన అభివృద్ధి జరుగుతోంది. గతంలో ఈ పాఠశాల వర్షం వస్తే పెచ్చులు ఉడుతాయని బంద్ చేసేది, నేడు కార్పొరేట్ స్కూల్ నే తలదన్నేలా ఉంది. 50లక్షల సిఎస్ఆర్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే ఈ పాఠశాలకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ను ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలం మొత్తం కంప్యూటర్ కాలమే కావున విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలి. కంప్యూటర్ పరిజ్ఞానం జీవన విధానం లో భాగమైంది. జిల్లాలో ఎక్కువ మంది ఆడపిల్లలు చదివే పాఠశాల ఇది. ఈసారి ఈ పాఠశాల పదవ తరగతి లో వందశాతం ఫలితాలు సాధించాలి. మీరు బాగా చదవండి భవిష్యత్ మీ చేతిలోనే ఉంది. మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పదవ తరగతిలో 100 శాతం మార్కులు సాధించాలి. సిద్దిపేట నియోజకవర్గం పదిలో ప్రథమ స్థానం లో నిలవాలన్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు.. ఆరు గ్యారేజీల్లో చేరాయి
