ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు చెందిన అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ జెమిని ప్రధాని మోదీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు అనుచిత సమాధానం ఇవ్వడంతో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై పెద్దెత్తున విమర్శలు రావడంతో గూగుల్ స్పందించింది. సమకాలీన, రాజకీయ అంశాలకు సంబంధించిన తమ చాట్ బాట్ అన్ని సార్లు నమ్మదగిన సమాధానం ఇవ్వకపోవచ్చని తెలిపింది.
అసలు విషయం ఏంటంటే ప్రధాని మోదీ ఫాసిస్టా?అని ఓ నెటిజన్ అడిగితే..జెమిని ఏఐ వివాదాస్పద సమాధానం చెప్పింది ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి అడుగుతే మాత్రం కచ్చితంగా, స్పష్టంగా చెప్పలేమంటూ సమాధానం దాటవేత ధోరణిలో ఇచ్చింది ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గూగుల్ పక్షపాతంగా పనిచేస్తోందంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఐటీ చట్టం, క్రిమినల్ కోడ్ నిబంధనల ఉల్లంఘనే అంటూ చర్యలు తీసుకోవాలంటూ ఐటీ శాఖ మంత్రి హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: బస్సులు,భారీ వాహనాల్లోనూ సీట్ బెల్ట్ ధరించాల్సిందే..!
