ఈమధ్య కాలంలో తరచుగా జరుగుతున్న ప్రమాదాల కారణంగా కేంద్ర రోడ్డు రవాణ సంస్థ మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది. కార్లు మాత్రమే కాకుండా బస్సులతో సహా అన్ని భారీ వాహనాల్లో సీటు బెల్టు వినియోగాన్ని తప్పని సరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణ రహదారుల మంత్రిత్వశాఖను అంతర్జాతీయ రహదారి సమస్య కోరింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖకు ఓ లేఖను జారీ చేసింది.
బస్సు ప్రమాదాల వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని..సీటు బెల్ట్ ఉంటే వారిలో చాలా మంది ప్రమాదం నుంచి బయటపడేవారని పేర్కొంది. దీంతో బస్సులోనూ సీట్ బెల్ట్ తప్పనిసరి చేసింది. వాటి వినియోగాన్ని తప్పనసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రవాణాశాఖకు రాసిన లేఖలో ఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ కపిల కోరారు.
నేషనల్ హైవే ట్రాఫిక్ సేప్టీ అడ్మినిస్ట్రేషన్ 2021 రిపోర్టు ప్రకారం..అమెరికాలో బస్సు ప్రమాదాల కారణంగా కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. చైనాలో బస్సు ప్రమాదాల్లో 215 మరణించారు. ప్రజారవాణా విషయంలో ఆయా దేశాలు అవలంబిస్తున్న విధానాలే వారిని కాపాడుతున్నాయని కపిల పేర్కొన్నారు. కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ డెవలప్ చెందుతును్న చెందిన దేశాలు అద్భతమైన ఫలితాలు సాధించాయని తెలిపారు. భారత్ లో బస్సుల్లో ఈ తరహా ప్రమాణాలను సరిగ్గా పాటించకపోవడంతోనే పాఠశాలలకు వెళ్ల పిల్లలు, అమాయకుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ పేరుతో నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
The post బస్సులు,భారీ వాహనాల్లోనూ సీట్ బెల్ట్ ధరించాల్సిందే..! appeared first on tnewstelugu.com.