ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని తెలిసి ఓ ఇంటిమీద దాడి చేసేందుకు వెళ్ళిన ఇన్ కమ్ టాక్స్ అధికారులకు.. ఇంటిముందు ఉన్న ఖరీదైన రోల్స్ రాయిస్, ఫాంటమ్, మెక్ లారెన్, లంబోర్ఘని, ఫెర్రారీ వంటి కార్లు చూసి మతిపోయింది. ఆ కార్ల ఖరీదు సుమారు 60 కోట్లవరకూ ఉంటుందట. కార్లే ఇన్ని ఉంటే, ఇంట్లో ఎంత డబ్బుందోనని అధికారులు ఇంటిమీద దాడి చేశారు. సోదాల్లో 4.5 కోట్ల రూపాయల నగదుతో పాటు కోట్ల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్ల దొరికాయట.
ఢిల్లీలోని టొబాకో బారన్ కంపెనీ యజమాని కుమారుడు శివమ్ మిశ్రా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలోని అతని ఇంటితోపాటు కాన్పూర్, ముంబై తదితర 20 ప్రాంతాలలో ఉన్న ఆస్తులపై ఏకకాలంలో దాడులు జరిపారు. కార్లతో పాటు సోదాల్లో బయటపడిన నగదును, డాక్యుమెంట్లను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు అధికారులు.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం కూలడం ఖాయం
