రంగారెడ్డి: షర్మ్ షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ ట్రావెలర్ ఒమర్ అల్ కేసరీ నుంచి కోటి రూపాయల విలువైన 1,821 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాటన్ బాక్సులో దాచిన బంగారాన్ని పేస్టులా మార్చేందుకు ఒమర్ ప్రయత్నించాడు. కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో అక్రమ బంగారం బయటపడింది.
కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. ఒమర్పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
The post బంగారాన్ని పేస్టులా మార్చిన స్మగ్లర్.. కాటన్ బాక్సుల్లో దాచి.. appeared first on T News Telugu.