నేడు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బేగంపేట నుంచి సోమాజిగూడ వరకు అరగంటపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు. రాత్రి 7.40 నుంచి 8.10 నిమిషాల మధ్య బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రాజ్ భవన్ వరకు 5వ తేదీ ఉదయం 9.50 నుంచి 10.15 నిమిషాల మధ్య రాజ్ భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఎల్బీస్టేడియంతోపాటు తెలంగాణ వెల్ఫేర్ డిపార్టుమెంట్ లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం నియామక పత్రలు అందజేస్తుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: మోదీ నన్ను క్షమించరని తెలుసు..!
The post నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వెళ్తే పద్మవ్యూహంలో చిక్కినట్లే..! appeared first on tnewstelugu.com.
