తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC ) కీలక ప్రకటన చేసింది. ఇవాళ(బుధవారం) గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. గ్రూప్ -2 రాతపరీక్షలను ఆగస్టు 7, 8 తేదీల్లో, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు TSPSC స్పష్టం చేసింది.
జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే TSPSC ప్రకటించింది. గ్రూప్-1లో 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1388 పోస్టులున్నాయి.
ఇది కూడా చదవండి: రేపు 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
