ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హమీని నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇవాళ(బుధవారం) ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటామని నినాదాలు చేశారు.
కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి… ఎల్ఆర్ఎస్ పథకం గడువు మార్చి నెలాఖరు వరకు డెడ్లైన్) పెట్టడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని వాగ్ధానాలు చేసిన నాయకులు… ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతకు గురైందన్నారు.
మరోవైపు ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే చర్యలు తీసుకుంటుందని విమర్శించారు సుధీర్రెడ్డి.
ఇది కూడా చదవండి: LRS ను ఉచితంగా చేయాలని.. లేదంటే న్యాయ పోరాటం తప్పదు
