ఆరు గ్యారంటీల పథకాల అమలు పార్లమెంట్ ఎన్నికలకోసమే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై 20 వేల భారాన్ని మోపేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైటాయించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎద్రబెల్లి దయాకర రావు, ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎర్రబెల్లి… అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ , ప్రియాంక. మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు 420 హామీలు ఇచ్చారన్నారు.
200 యూనిట్లు ఉచిత విద్యుత్ పేరుతో 201 విద్యుత్ బిల్లు వచ్చినా మొత్తం డబ్బులు వసేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి పూర్తి స్ధాయిలో ఉచిత విద్యుత్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎల్ఆర్ఎస్ పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు..ప్రభుత్వం ఏర్పడగానే ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలపై భారం మోపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ ను ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం సరైంది కాదన్నారు ఎర్రబెల్లి.
ఇది కూడా చదవండి: హామీలు అమలు చేసేవరకు ప్రజా క్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం
