రాష్ట్రం లో కాంగ్రెస్ పాలనకు మూడు నెలలు పూర్తయ్యాయని చెప్పారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మార్పు తెస్తామని రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారన్నారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయేన..ప్రజలు మరింత బాగు చేస్తామని కాంగ్రెస్ చెబితే నమ్మారు.మూడు నెలల్లో ప్రజలకు గతంలో దక్కిన మేళ్లు కూడా రావడంలేదు. కాంగ్రెస్ పాలనలో అనేక అవకాశాలను ప్రజలు కోల్పోతున్నారు.సాగు తాగు నీళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ నేతలకు కర్ణాటక నుంచి నీళ్లు అడిగి తెచ్చేసోయి లేదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి మానవ బాంబులు ,మెడలో పేగులు వేసుకోవడం గురించి మాట్లాడుతున్నారని అన్నారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వ తీరుతో రైతుల పేగులు రేవంత్ మెడకు పడుతున్నాయి. రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొడుతా అంటారు ఓ మంత్రి. సాగునీటిపై ప్రభుత్వం ఒక్కరోజైనా సమీక్ష చేసిందా అని అడిగారు. ప్రభుత్వం పంట దిగుబడిపై అంచనా వేసిందా. ఇప్పటికీ కూడా కాళేశ్వరం నీటిని వాడుకునే అవకాశం ఉంది….ఎకరా పంట ఎండి పోకుండా కాపాడవచ్చన్నారు. మంచి నీళ్ళు లేవని,పంటలు ఎండి పోయాయని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే కేసు లు పెడుతున్న ప్రభుత్వం ఇది అని అగ్రహం వ్యక్తం చేశారు. కరువు,వ్యవసాయం పై సీఎం ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఢిల్లీకి ముడుపులు ముట్ట చెప్పేందుకే సీఎంకు ఆసక్తి ఉంది తప్ప.. రాష్ట్రం లో సమస్యల పరిష్కారం పై ముందస్తు ప్రణాళిక లేదని ఆరోపించారు జగదీష్ రెడ్డి. రేవంత్ గురువు బాబు సీఎం గా ఉన్న సమయంలో జరిగిన ఘటనలు మళ్ళీ మొదలయ్యాయన్నారు. ఇకనైనా సీఎం రేవంత్ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ద్రుష్టి పెట్టాలని సూచించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
ఇది కూడా చదవండి:రేవంత్ రెడ్డి.. నీలాగా ఆంధ్ర నాయకుల బూట్లు నాకి రాజకీయాల్లోకి రాలే
