మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సితో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటామని తెలిపారు.
హైదరాబాద్: మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సితో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటామని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మహాలక్ష్మిలో మొదటిసారి ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీ అంటేనే పేద ప్రజలు ప్రయాణించే బస్సు అని తెలిపారు.
ఆర్టీసీ సమస్యలను పరిష్కరించి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసి సిబ్బంది కష్టపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే కారుణ్య నియామకాలు చేపట్టామని, త్వరలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
