కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల మండలం వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర వాహనాన్ని తప్పించబోయి లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. దాదాపు రూ.50లక్షల విలువైన మద్యం రోడ్డు పాలైంది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ డిపో నుంచి జగిత్యాలలోని పలు వైన్ షాపులకు లిక్కర్ తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. మల్యాల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని భద్రత కల్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో చేరుతున్నానని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు
The post వ్యాన్ బోల్తా.. రూ.50 లక్షల మద్యం రోడ్డు పాలు appeared first on tnewstelugu.com.
