Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

23న ‘ఎర్త్ అవర్’.. మీరు మర్చిపోకుండా చేయాల్సిన కొన్ని పనులు ఇవే..!

TelanganapressBy TelanganapressMarch 20, 2024No Comments

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఏడాదికి ఒక రోజున ‘ఎర్త్ అవర్’ పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీనిని జరుపుకొంటున్నారు. ఈసారి ఈ నెల 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు నిర్వహిస్తున్నారు. ఆ రోజున అందరూ గంటపాటు అవసరం లేని లైట్లను ఆపివేయాల్సి ఉంటుంది.

మొదటగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్ పాటించారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్  (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) దీనిని ప్రారంభించింది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక గంటపాటు లైట్లు ఆపివేయాలని పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దీనిని కొనసాగిస్తున్నారు. తొలి పిలుపునకే అనూహ్య స్పందన లభించింది. లక్షలాదిమంది ప్రజలు, వేలాదిమంది వ్యాపారవేత్తలు ఇందులో భాగస్వామ్యమయ్యారు. ప్రస్తుతం ఈ ఇందులో 190 దేశాలు భాగస్వామ్యమయ్యాయి.

ఎర్త్ అవర్ వల్ల అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాల వాడకం గంటపాటు ఆగిపోతుంది. ఈ చిన్న పని భూమిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. వాతావరణ మార్పులపై ప్రపంచం మొత్తం ఏకమై చేసే పోరాటానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎర్త్ అవర్ అనగానే గంటపాటు లైట్లు ఆపేస్తే బోల్డంత విద్యుత్తు ఆదా అవుతుందన్నది మనకు కనిపించే అంశం మాత్రమే. కానీ, దీని ద్వారా ప్రపంచానికి ప్రభావవంతమైన సందేశం వెళ్తుంది. పర్యావరణంపై మనకున్న శ్రద్ధను ఇది బయటపెడుతుంది. భవిష్యత్ తరాల కోసం ఈ భూమిని రక్షించాలన్న నిబద్ధతను ఇతరులతో పంచుకునేందుకు, సంఘీభావం ప్రదర్శించేందుకు మంచి అవకాశంగా నిలుస్తుంది.

ఎర్త్ అవర్‌లో పాల్గొనేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా 23న రాత్రి 8.30 నుంచి గంటపాటు అంటే 9.30 వరకు అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను కట్టేయడమే. తద్వారా ఆ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఆ గంటలో.. నక్షత్రాలను ఎంచక్కా చూడవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. బయటకు వెళ్లి అలా ప్రకృతిని చూస్తూ ఆరుబయట ఎంజాయ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేలు నష్టపరిహారం ఇవ్వండి

 

 

 

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.