మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న జనానికి కాస్తంత ఉపశమనం లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్లు ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండతో తీవ్ర ఇబ్బందులు పడ్డ జిల్లా వాసులకు కాస్తంత ఉపశమనం లభించింది. తీవ్ర ఎండలతో అలాడుతున్న ప్రజలకు ఐఎండీ హైదరాబాద్ విభాగంగా చల్లట కబురు చెప్పింది.
ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్లో మాత్రం కురిసే అవకాశం లేదని చెప్పింది. 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడాచదవండి : కాంగ్రెస్ క్యాడర్ నిరుత్సాహం, తుక్కుగూడలో లక్షకు మించని జనం.!
The post ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్లు మోస్తరు చిరుజల్లులు.! appeared first on tnewstelugu.com.