Tirumala | వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుమల రద్దీగా మారింది .

తిరుమల : వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుమల (Tirumala) రద్దీగా మారింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 13 కంపార్టుమెంట్లలో వేచి యున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 65,570 మంది భక్తులు దర్శించుకోగా 24446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3. 53 ఆదాయం వచ్చిందని తెలిపారు.