
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం లక్నో-బహ్రైచ్ హైవేపై బహ్రైచ్లో భారీ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. దీంతో 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే భారీ మంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
బహ్రైచ్, ఉత్తరప్రదేశ్ | బహ్రైచ్లోని తప్పే సిపాలో రోడ్వేస్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మరణించారని మరియు 15 మంది గాయపడ్డారని SHO రాజేష్ సింగ్ ధృవీకరించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.పోలీసులు వచ్చారు pic.twitter.com/A5MPOomd05
— ANI UP/ఉత్తరాఖండ్ (@ANINewsUP) నవంబర్ 30, 2022
861865
