
జోగుళాంబ ఆలయం |జోగులాంబ గద్వాల: అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఈ మేరకు గురువారం జోగులాంబ దేవస్థానం నుంచి చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఈఓ పురేందర్కుమార్, ప్రధాన అర్చకులు ఆనంద్శర్మ, వేదపండితులు వంకాయల శ్యామ్కుమార్ శర్మ పురస్కారాన్ని అందుకున్నారు.
బెంగుళూరులో హిందూస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శక్తిపీఠ సమాగమం నిర్వహిస్తున్నారు. మరియు సంస్థ కార్యవర్గం సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష కృషి చేసిన శక్తిపీఠాలను సత్కరించింది.
ప్రతిష్టాత్మక హిందుస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డ్ – శ్రీ జోగులాంబ టెంపుల్ 2022 అందుకోవడం పట్ల తెలంగాణ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ తుంగభద్ర పుష్కరాలు విజయవంతమయ్యాయని ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేసి దర్శన భాగ్యం కల్పించామన్నారు.
