
- డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు
- ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 19: సీతాఫల్మండిలోని కుట్టి వెలోడి ప్రభుత్వాసుపత్రి (సిటీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్లతో నూతనంగా నిర్మించేందుకు ఆమోదం తెలిపిందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలిపారు. ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నందున నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. లాలాపేటలో నిర్మించిన ఈత కొలను 6 కోట్లు, రూ. లా లాపేటలో రూ.6 కోట్లు, అడ్డగుట్టలో రూ.225 కోట్లతో ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. అనంతరం కుటి వెలోడి ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మారావు మాట్లాడుతూ ప్రతిరోజు కనీసం పది మంది గర్భిణులు, సుమారు 200 మంది సాధారణ రోగులకు ఓపీ సేవలు, ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. కొత్త భవనానికి ప్రతిపాదన పంపగా.. కార్పొరేట్ ఆస్పత్రికి అనువుగా ఉండే సుమారు 900 గజాల స్థలాన్ని ఆస్పత్రికి ఆక్రమించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు చెప్పారు. తమ వినతులపై వెంటనే స్పందించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆసుపత్రిని తాత్కాలికంగా తరలించేందుకు సహకరించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లను కోరారు. ఆసుపత్రి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువజన నాయకులు కిషోర్కుమార్, కిరణ్కుమార్, రామేశ్వర్గౌడ్, తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
