Cricket betting | రాష్ట్రంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్(Cricket betting) దందా సాగుతున్నది. తాజాగా ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్(Cricket betting) దందా సాగుతున్నది. తాజాగా ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులకు అందిన పక్క సమాచారం మేరకు మియాపూర్(Miyapur) పరిధిలో దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 1.96 లక్షలు, 4 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా బెట్టింగ్ పాలపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.