Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి కంఫర్ట్గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.

Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి కంఫర్ట్గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్లో కాంగ్రెస్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారని.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పీసీసీ పదవి వేరే.. సీఎం పదవి వేరేనన్నారు. సీఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారని.. సెకండ్ పొజిషన్ కోసం కాంగ్రెస్లో పోటీపడుతున్నారన్నారు. భట్టి బీ ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్లే లీకులు ఇచ్చారన్నారు.
చంద్రబాబుకు, రేవంత్కు సేమ్ పోలికలు ఉన్నాయన్నారు. ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ పేరుతో మూడు గ్రూప్లు ఉన్నాయని.. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారన్నారు. రేవంత్కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారని.. సీఎం స్థాయిలో ఉండి కుట్ర చేస్తున్నారనడం ఆయన రేవంత్ అసమర్థతకు నిదర్శనమన్నారు. గేట్లు ఓపెన్ చేసినా, విండోలను ఓపెన్ చేసినా ఎవరు కాంగ్రెస్లోకి వెళ్లడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో కంఫర్ట్ లేదని.. సొంత దుకాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. గేట్లు ఎత్తేమని చెబుతున్నారు కదా.. ఎక్కడ ఎమ్మెల్యేలు? అంటూ ప్రశ్నించారు. తాము గేట్లు ఎత్తాల్సిన అవసరం లేదని.. ఉప ఎన్నికలు వస్తే హాయ్ శ్రీరామ్ అంటామన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదని.. వాళ్ల మధ్య విభేదాలే వాళ్లను వీక్ చేస్తాయన్నారు. తమ మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో లేరని.. బీజేపీ ప్రజలను నమ్ముకుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారన్నారు. ప్రభుత్వం కూలిపోతుందని.. ముఖ్యమంత్రి వెంట భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ కుట్ర జరుగుతుందని రేవంత్ అంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు షిండేలు ఉన్నారని.. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏ అంటే పార్టీలో ఉంటే.. నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ బీ అంటే.. పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు ? అన్నారు. రేవంత్ టెన్షన్ తట్టుకొలేక ఓ ఐపీఎస్ అధికారి గుండెపోటుతో మరణించారని ఆరోపించారు.