Medaram Jatara | ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్రెడ్డి కి ఆలయ పూజారుల సంఘం ఆహ్వానపత్రికను అందజేసింది.
హైదరాబాద్ : ములుగు(Mulugu District) జిల్లా మేడారంలోని సమ్మక్క(Sammakka), సారలమ్మ (Saralamma) మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) కి ఆలయ పూజారుల సంఘం ఆహ్వానపత్రికను అందజేసింది.
ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, జాతరలో చేపట్టవలసిన పనులు, పూజారుల సమస్యలపై పూజారులు, దేవాదాయం శాఖ అధికారులు సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. వీరి వెంటే మంత్రులు సీతక్క(Minister Seetakka), కొండ సురేఖ, పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన పోస్టర్లను సీఎం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23న మేడారం జాతరకు తాను వస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు.
