![ఆగి ఉన్న ట్రాక్టర్ని స్కూటీ ఢీకొంది.ఇద్దరు మైనర్లు చనిపోయారు](https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2022/11/aaccident-3.jpg)
రంగారెడ్డి: కొత్తూరు మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలం ఫాతిమాపూర్లో వేగంగా వెళ్తున్న స్కూటర్ ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులిద్దరూ మైనర్లేనని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.
856155