![ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది](https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2023/01/Adilabad-1.jpg)
ఆదిలాబాద్ : వారం పది రోజుల్లో చలికాలం ముగుస్తుంది. అయితే ఆదిలాబాద్ ప్రాంతం వైపు చలిపులి పంజా విసురుతోంది. మండల వ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోయారు. జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతోపాటు చలిగాలులు వీస్తుండటంతో ఉదయం 10గంటలకు కూడా బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
పర్వతాలు, జాతీయ రహదారులు, గ్రామాలు మరియు వాగులు దట్టమైన పొగమంచుతో కప్పబడి, చలి తీవ్రమైంది. దీంతో ప్రజలు మళ్లీ స్వెట్టర్లు, చలి మంటలను ఆశ్రయించాల్సి వచ్చింది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలితో వణికిపోతున్న ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే బంధించారు.