ఆఫ్ఘనిస్థాన్లో మరో బాంబు పేలుడు సంభవించింది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లోని ఓ పాఠశాలను ఉగ్రవాదులు ఈరోజు (బుధవారం) లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో దాదాపు 10 మంది విద్యార్థులు మరణించారని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. ఉత్తర సమంగాన్ ప్రావిన్స్లోని ఐబాక్లో పేలుడు సంభవించిందని, పలువురు గాయపడినట్లు సమాచారం.
ఈ దాడిలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ బాంబు దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది.
The post ఆఫ్ఘనిస్థాన్ స్కూల్ బాంబు దాడి: 10 మంది విద్యార్థులు మృతి appeared first on T News Telugu.