
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్త బస్ స్టేషన్ సమీపంలోని శ్రీవేంకటేశ్వర ఆయిల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. క్రమంగా మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించడంతో లోపల ఉన్న సిలిండర్లు పెద్ద శబ్ధంతో పేలిపోయాయి. మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ఇళ్లను పోలీసులు ఖాళీ చేయించారు.
అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్క్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ
భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.