![odisha](https://i0.wp.com/tnewstelugu.com/files/2023/01/odisha.jpg?resize=696%2C395&ssl=1)
మంత్రికి రక్షణగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి ఆయనపై కాల్పులు జరిపాడు. ఆదివారం ఉదయం ఒడిశా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిషోర్ దాస్ ఈ సమావేశానికి ఝార్సుగూడ జిల్లాలోని బ్రజ్రాజ్నగర్కు వెళ్లారు. గాంధీ ప్లాజాలో మంత్రి కారు దిగగానే.. అదే ప్రాంతంలో అసిస్టెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మంత్రి ఛాతీ, పొత్తికడుపులో బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే తేరుకున్న మంత్రి సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన సమయంలో ఏఎస్ఐ డ్యూటీలో ఉన్నారని బ్రజరాజ్నగర్ ఎస్డిపిఓ గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు. మంత్రిని ఏఎస్ఐ ఎందుకు కాల్చిచంపాలో అర్థంకాలేదని భోయ్ అన్నారు. ఘటన జరిగిన వెంటనే ఏఎస్ఐని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.